లక్నో కోర్టులో బాంబు పేలుడు: పలువురికి గాయాలు

Published : Feb 13, 2020, 01:05 PM ISTUpdated : Feb 13, 2020, 01:50 PM IST
లక్నో కోర్టులో బాంబు పేలుడు: పలువురికి గాయాలు

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కోర్టులో గురువరాం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గురువారం నాడు ఉదయం బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. కోర్టు ఆవరణలోనే మూడు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తమకు రక్షణ కల్పించాలని న్యాయవాదులు కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. తనను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగిందని  లక్నో బార్ అసోసియేషన్  సహాయ కార్యదర్శి సంజీవ్ లోధి అభిప్రాయపడ్డారు. బాంబు పేలుడు యూపీ విధానసభకు కిలోమీటరు దూరంలో చోటు చేసుకొంది

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu