Blast in Banglore: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Published : Sep 23, 2021, 01:27 PM ISTUpdated : Sep 23, 2021, 01:35 PM IST
Blast in Banglore: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

సారాంశం

బెంగుళూరులోని న్యూ తారగ్ పేటలో గురువారం నాడు పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

బెంగుళూరు: కర్ణాటక (karnataka)రాష్ట్రంలోని  బెంగుళూరులోని(banglore) న్యూ తారగ్ పేటలో(New Taragupet ) గురువారం నాడు పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.కెఆర్ మార్కెట్ (kr market) సమీపంలోని న్యూ తారగ్ పేటలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

న్యూ తారగ్ పేటలోని భవనంలో పేలుడు చోటు చేసుకొంది. గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొందని  స్థానికులు చెబుతున్నారు.  ఈ భవనంలోని నాలుగో అంతస్థులో పేలుడు చోటు చేసుకొంది. ఈ భవనంలోని సీ, బీ బ్లాక్ లోని పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. 

బ్లాస్ట్ జరిగిన భవనానికి సమీపంలోనే స్కూల్ ఉంది. అయితే ప్రస్తుతం స్కూల్ కు సెలవులు ఇచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు ఈ ప్రమాదం నాలుగో అంతస్థులో చోటు చేసుకొంది. అయితే మంటలు ఇతర గదులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు అధికారులు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్ర‌తిప‌క్షాల‌కు మోదీ, షా మాస్ట‌ర్ స్ట్రోక్‌.? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగినా బీజేపీకే లాభ‌మా.?
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu