బిల్కిస్ బానో కేసు దోషులకే క్షమాభిక్ష ఎందుకు? : గుజ‌రాత్ స‌ర్కారుకు సుప్రీంకోర్టు సూటిప్ర‌శ్న

Published : Aug 18, 2023, 06:01 AM IST
బిల్కిస్ బానో కేసు దోషులకే క్షమాభిక్ష ఎందుకు? :  గుజ‌రాత్ స‌ర్కారుకు సుప్రీంకోర్టు సూటిప్ర‌శ్న

సారాంశం

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు దోషుల‌కు  ఉపశమన విధానాన్ని ఎంపిక చేయడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక‌లు అందించాల‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గుజరాత్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులకు ఉపశమన విధానాన్ని ఎంపిక చేయడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ప్రశ్నించింది.  

Supreme Court: 2002 గోద్రా అనంతర అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులకు ఉపశమన విధానాన్ని 'సెలెక్టివ్'గా వర్తింపజేయడంపై సుప్రీంకోర్టు గురువారం గుజరాత్ ప్రభుత్వానికి, కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది.

విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజును జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. తిరిగి సంఘటితం కావడానికి, సంస్కరించడానికి ప్రతి దోషికి అవకాశం ఇవ్వాలి, కొద్దిమందికి కాదు. ప్రశ్న ఏమిటంటే, బిల్కిస్‌ దోషులకే క్షమాభిక్ష ఎందుకు? సామూహికంగా నేరానికి పాల్ప‌డిన కేసులో మ‌ర‌ణ శిక్ష‌ను జీవిత ఖైదుగా త‌గ్గించ‌గా, 14 సంవత్సరాల జీవిత ఖైదుకే ఎలా విడుద‌ల చేస్తారు. 14 సంవ‌త్సరాలు ఖైదుపడిన దోషులందరికీ ఉపశమనం ప్రయోజనం లభిస్తుందా? అంటూ ప్ర‌శ్నించారు. దోషికి వర్తించే ఉపశమన విధానాన్ని వివరిస్తూ 2022 మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జారీ చేసిన సమర్థవంతమైన మాండమస్ (ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఇచ్చిన రిట్) కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గుజరాత్ రాష్ట్రం తరఫున హాజరైన ఎఎస్జి ఎస్వి రాజు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

11 మంది దోషులకు ఉపశమనం కల్పించే ముందు గుజరాత్ 1992 ఉపశమన విధానానికి కట్టుబడి ఉండేలా చూసుకున్నామని ఏఎస్జీ ఎస్వీ రాజు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు గోద్రా జడ్జి అభిప్రాయానికి అనుకూలంగా మహారాష్ట్ర ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ప్రతికూల అభిప్రాయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించింది.  అలాగే, ఉపశమన విధానం ఖైదీల సంస్కరణ కోసమేనన్న వాదన ఎప్పుడు వినిపించిందనీ, అలాంటప్పుడు ఖైదీలు ఎందుకు రద్దీగా ఉన్నారని, ఉపశమన విధానం అమలుకు సంబంధించిన డేటాను ధర్మాసనానికి సమర్పించాలని ధర్మాసనం ఏఎస్జీని కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ధర్మాసనం వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?