బాణాసంచా ప్యాక్టరీలో భారీ పేలుళ్లు...ఏడుగురు మృతి

Published : Oct 26, 2018, 07:04 PM IST
బాణాసంచా ప్యాక్టరీలో భారీ పేలుళ్లు...ఏడుగురు మృతి

సారాంశం

ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ బాణాసంచా ప్యాక్టరీలో ప్రమాదవశాత్తు భారీ ఎత్తున పేలుడు జరగింది. ఈ ప్రమాదంలో చిక్కుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ బాణాసంచా ప్యాక్టరీలో ప్రమాదవశాత్తు భారీ ఎత్తున పేలుడు జరగింది. ఈ ప్రమాదంలో చిక్కుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘటన బుద్వాన్ జిల్లాలో చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో దీపావళి పండగ ఉండటంతో ఓ ప్యక్టరీలో భారీ ఎత్తున టపాసుల తయారీ జరుగుతోంది. అయితే ఇవాళ మద్యాహ్నం ప్రమాదవశాత్తు మందుగుండు సామాగ్రికి మంటలు అంటుకుని ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఒక్కసారిగా పేటుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తున్నఏడుగురు కార్మికులు మంటల్లో సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పేలుళ్ల ప్యాక్టరీ సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో పాటు పరిసరప్రాంతాల్లో ద‌ట్ట‌మైన పొగ అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ప్యాక్టరీకి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంటల్ని అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?