
బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వాహకం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ కాలేజ్ ‘‘ప్లేస్మెంట్ సెల్ ఫీజు’’ ద్వారా విద్యార్థుల జీతాల్లో 2.1 శాతం డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ ఉన్న రెడ్డిట్ పోస్టు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘బెంగళూరు’ రెడ్డిట్ గ్రూప్లో పర్పుల్రేజ్ఎక్స్ అనే యూజర్ ఈ పోస్ట్ చేశారు. ఒక కంపెనీలో ప్లేస్ అయిన తర్వాత విద్యార్థి ఫీజు చెల్లించాలని కాలేజ్ కోరిందని.. కాలేజ్ ఇప్పుడు ఆమె సర్టిఫికేట్లను నిలిపివేస్తోందని.. దీనివల్ల కంపెనీతో ఆమె తదుపరి ప్రక్రియకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోస్ట్లో పేర్కొనడం జరిగింది.
ఫీజు చెల్లించాలని కాలేజ్ కోరుతున్నట్టుగా ఎలాంటి అధికారిక పత్రం గానీ, సర్క్యులర్ గానీ పోస్టు చేయబలేదు. ‘‘వారు నాకు మాటలతో మాత్రమే చెబుతున్నారు. డబ్బు చెల్లించమని నన్ను బలవంతం చేస్తున్నారు. ఇంకా సంపాదించలేదు. నేను ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను. కానీ నేను CTCలో 2.1 శాతం చెల్లించాలని వారు కోరుకుంటున్నారు’’ అని పోస్ట్లో పేర్కొన్నారు. వేరే కంపెనీల్లో ఉద్యోగంలో చేరిన తన సీనియర్లకు కూడా కాలేజీ ఇలాగే చేసిందని విద్యార్థిని ఆరోపించారు.
అయితే పోస్ట్లో కళాశాల పేరును మాత్రం పేర్కొనలేదు. అయితే మరొక వినియోగదారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. దానిని కాలేజ్ ‘‘ప్లేస్మెంట్ సెల్ ఫీజు’’ ఫీజుగా పేర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్పామ్లలో వైరల్ అవుతుంది.