Sri Krishna Janmashtami 2022 : బెంగళూరులో మాంసం అమ్మకాలపై నిషేధం...

Published : Aug 18, 2022, 11:49 AM IST
Sri Krishna Janmashtami 2022 : బెంగళూరులో మాంసం అమ్మకాలపై నిషేధం...

సారాంశం

ఆగస్ట్ 19న బెంగళూరులో మాంసం అమ్మకాలపై అక్కడి నగరపాలక సంస్థ నిషేధం విధించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. 

బెంగళూరు : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాంసం అమ్మకాలను నిషేధిస్తూ బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 19వ తేదీన శుక్రవారం బెంగళూరు నగరంలోని కబేలాలను మూసివేయాలని, మాంసం దుకాణాలు మూసి వేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు.  శ్రీ కృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో బెంగళూరు నగరంలో కబేళాలు మూసి వేయడంతో పాటు మాంసం రీటేల్ విక్రయ దుకాణాలను మూసి వేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

5,249వ కృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ అధికారులు మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. గతంలో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ నెలలోనూ మాంసం అమ్మకాలను నిషేధించారు. బెంగళూరు నగరంలో బసవ జయంతి, మహాశివరాత్రి, గాంధీ జయంతి, సర్వోదయ డేల సందర్భంగా ఏడాదికి ఎనిమిది రోజుల పాటు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఉన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Performs Yoga: ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో యోగా ఆసనాలు వేసిన మోదీ | Asianet News Telugu
Nirmala Sitharaman: యోగాలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ | Asianet News Telugu