బాలికపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారం: వీడియో తీసి మరీ....

By telugu teamFirst Published Jan 25, 2021, 5:56 PM IST
Highlights

ఓ మైనర్ బాలికపై బ్యాంక్ మేనేజర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఆ సంఘటను మొత్తం వీడియో తీశాడు. దాంతో బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బ్యాంక్ మేనేజర్ తీవ్రమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై అతను అత్యాచారం చేశాడు. దానని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో జరిగింది. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మొహాలీకి ెచందిన ఓ మైనర్ బాలిక స్నేహితురాలితో 53 ఏల్ల ఓ బ్యాంక్ మేనేజర్ కు పరిచయమైంది. అతను ఆ బాలికను అప్పుడప్పుడు షాపింగ్ కు తీసుకుని వెళ్లేవాడు. ఓ రోజు హోటల్ గదికి తీసుకుని వెల్లి ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటనను మొత్తం వీడియో తీశాడు.

ఆ తర్వాతి నుంచి వీడియోను చూపించి బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. దీంతో విసుగు చెందిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్ మేనేజర్ మీద ఆమె ఫిర్యాదు చేసింది. 

పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితురాలిపై కూడా ఆ బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

click me!