ఆరేళ్లుగా మరదలిపై అత్యాచారం: పోలీసులకు చిక్కాడిలా....

Published : Jun 14, 2019, 09:05 AM ISTUpdated : Jun 14, 2019, 09:21 AM IST
ఆరేళ్లుగా మరదలిపై అత్యాచారం: పోలీసులకు చిక్కాడిలా....

సారాంశం

ఆరేళ్లుగా మరదలిపై బావ అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన తమిళనాడు  రాష్ట్రంలో చోటు చేసుకొంది.   

ఆరేళ్లుగా మరదలిపై బావ అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన తమిళనాడు  రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడ్ సమీపంలోని ఓ గ్రామంలో అయ్యప్పన్ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఆయన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 

అయ్యప్పన్ భార్య పదవతరగతి చదువుతోంది. అయ్యప్పన్ ఇంట్లోనే ఆ యువతి కూడ నివాసం ఉండేది. అయితే ఆరేళ్లుగా ఆ యువతిపై అయ్యప్పన్ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

అయితే  ఇటీవల ఆ యువతి గర్భం దాల్చింది.  ఈ విషయం తెలిసిన అయ్యప్పన్ ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లి  అబార్షన్ చేయాలని వైద్యులను కోరారు. ప్రియుడి కారణంగా ఆ యువతి గర్భం దాల్చిందని  వైద్యులకు చెప్పాడు.  అయ్యప్పన్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు అయ్యప్పన్‌ను విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ATM రూల్స్ చేంజ్.. ఈ బ్యాంక్ ఏటిఎంలో డబ్బులు తీసుకుంటే ఛార్జీల మోతే
Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ఒకటి రెండు కాదు ఏకంగా 30 శాతమా..?