రక్తస్రావంతో విలవిల్లాడిపోతున్నా వదలకుండా... బాలింతపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Published : Jul 10, 2023, 11:43 AM IST
రక్తస్రావంతో విలవిల్లాడిపోతున్నా వదలకుండా... బాలింతపై ఆటో డ్రైవర్ అత్యాచారం

సారాంశం

ఒంటరిగా ఆటో ఎక్కిన బాలింతపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. 

ముంబై : మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు... కొందరు మగాళ్లలో మృగం బయటకువస్తాడు. చిన్నపిల్లల నుండి పండుముసలి వరకు ఇలాంటి మృగాల చేతిలో అఘాయిత్యాలకు గురవుతున్న దారునాలు అనేకం.చివరకు గర్భంతో వున్నవారిని, బాలింత మహిళలను కూడా వదిలిపెట్టడంలేదు. ఇలా ఓ బాలింతపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన అమానుషం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర రాజధాని ముంబైలో నివాసముండే ఓ మహిళ ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన రెండునెలలు తర్వాత పని వుండటంతో ఆమె బయటకు వెళ్ళింది. ఈ క్రమంలోనే నవీ ముంబైలోని సిబిడి బెలాపూర్ ప్రాంతంనుండి గోరేగావ్ వెళ్ళేందుకు ఆమె ఓ ఆటో ఎక్కింది. ఒంటరిగా వున్న ఆమెపై కన్నేసిన ఆటోడ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యాని పాల్పడ్డాడు. 

మహిళకు అనుమానం రాకుండా బహిర్భూమికి వెళతానని చెప్పి మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలోకి ఆటోను పోనిచ్చాడు డ్రైవర్. ఓ చోటు ఆటోను నిలిపి మహిళపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అత్యాచారం అనంతరం మహిళను విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసవం సమయంలో వేసిన కుట్లు ఊడిపోయాయి. నొప్పితో విలవిల్లాడిపోయిన మహిళను ఆటోలో ఎక్కించి ఓ ప్రాంతంలో వదిలివెళ్లాడు ఆటో డ్రైవర్. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బయపడిపోయిన మహిళ బయటపెట్టలేదు. 

Read More  వివాహేతర సంబంధం : దూరం పెట్టిందని.. మహిళపై యాసిడ్ దాడి !

మే 17న ఈ దారుణ ఘటన జరగ్గా బాధితురాలు తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత మహిళ నుండి వివరాలు సేకరించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం