దారుణం.. భార్యను హత్య చేసి, మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి గార్డెన్ లో పూడ్చిపెట్టిన భర్త.. కోల్ కతాలో ఘటన

By Asianet NewsFirst Published Mar 23, 2023, 8:16 AM IST
Highlights

ఓ భర్త తన భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను ఘోరంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికాడు. వాటిని ఓ గార్డెన్ లో పాతిపెట్టాడు. ఈ ఘటన కోల్ కత్తాలో చోటు చేసుకుంది. 

గత ఏడాది ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తరువాత అలాంటి ఘటనలే దేశ వ్యాప్తంగా అనేక చోట్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో కూడా ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికాడు. వాటిని ఓ గార్డెన్ లో పాతిపెట్టాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

2012లో సైనిక తిరుగుబాటు యత్నం.. జనరల్ వీకే సింగ్ ఏమన్నారంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్ కతాకు చెందిన అలీం షేక్, ముంతాజ్ షేక్ లు భార్యాభర్తలు. మంగళవారం రాత్రి భర్త తన భార్య పని చేసే ప్రదేశానికి వెళ్లాడు. ఆమెను బైక్ పై ఎక్కాలని కోరాడు. భర్త కోరిక మేరకు ఆమె బైక్ ఎక్కింది. తరువాత ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడే గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం కోల్ కతా దక్షిణ శివార్లలోని బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా గార్డెన్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికాడు. తరువాత వాటిని అక్కడే పాతిపెట్టాడు. 

కొంత సమయం తరువాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. అతడు ఒంటరిగా ఇంటికి రావడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ముంతాజ్ ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఆమె షాపింగ్ చేస్తానని కోరిందని, దీంతో స్థానిక మార్కెట్ దగ్గర బైక్ దిగిందని వారికి వివరించాడు. కానీ అలీం మాటలు వారికి నమ్మబుద్ధి కాలేదు. కానీ కొంత సమయం వరకు వేచి ఉన్నారు. 

బిల్కిస్ బానో అత్యాచార దోషులకు సుప్రీం షాక్.. ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటుకు అంగీకారం..

అయితే అర్థరాత్రి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిపై ఒత్తిడి తెచ్చారు. ఏం జరిగిందో నిజం చెప్పాలని కోరారు. అయినా కూడా అతడు మౌనంగా ఉండడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు ఒత్తిడికి తలొగ్గిన అలీం బుధవారం ఉదయం తన నేరాన్ని అంగీకరించాడు.

'కుక్క మాంసం' వివాదం.. అస్సాం అసెంబ్లీలో దుమారం.. మహారాష్ట్ర సీఎంకు హిమంత బిస్వా శర్మ లేఖ

అతడు చెప్పిన వివరాలతో నిందితుడితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన భార్య శరీర భాగాలను పాతిపెట్టిన ప్రదేశాన్ని నిందితుడు చూపించాడు. దీంతో పోలీసులు ఆ ప్రదేశాన్ని తవ్వి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతటి దారుణానికి పాల్పడటానికి గల కారణాన్ని నిందితుడు ఇంకా వెల్లడించలేదు. స్థానిక పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోందని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. ఈ హత్య పై పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.
 

click me!