తుపాకులు నన్ను ఆపలేవు, ఒక ఒవైసీని చంపితే ఎంతోమంది ఓవైసీలు పుడతారు: బీజేపీపై విరుచుకుపడ్డ ఏ‌ఐ‌ఎం‌ఐ‌ఎం చీఫ్..

Ashok Kumar   | Asianet News
Published : Feb 06, 2022, 01:04 AM ISTUpdated : Feb 06, 2022, 01:06 AM IST
తుపాకులు నన్ను ఆపలేవు, ఒక ఒవైసీని చంపితే ఎంతోమంది ఓవైసీలు పుడతారు: బీజేపీపై విరుచుకుపడ్డ  ఏ‌ఐ‌ఎం‌ఐ‌ఎం చీఫ్..

సారాంశం

 తన కారుపై దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత  ఏ‌ఐ‌ఎం‌ఐ‌ఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi)శనివారం బిజెపి(bjp) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిందించారు అలాగే సాధారణ ప్రజలను రక్షించలేని వారు తనకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంలో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.  

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై గురువారం సాయంత్రం హాపూర్ జిల్లాలోని ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద తన వాహనంపై కాల్పులు జరిపిన రెండు రోజుల తర్వాత  ఉత్తర్‌లోని శాంతిభద్రతలపై  ప్రశ్నిస్తూ విరుచుకుపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఛప్రౌలీ అసెంబ్లీలోని పార్టీ అభ్యర్థి అనీస్ అహ్మద్‌కు అనుకూలంగా ఎన్నికల సభలో ప్రసంగించేందుకు అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడకు వచ్చారు. 

పార్టీ అభ్యర్థి అనీస్ అహ్మద్‌కు మద్దతుగా బాగ్‌పత్ జిల్లాలోని చప్రౌలి అసెంబ్లీ నియోజకవర్గంలోని అసరా గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఓవైసీని చంపితే ఎంతో మంది ఒవైసీలు పుడతారు. అలాగే బీజేపీ సామాన్య ప్రజలను కాపాడలేకపోతే నాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం ఏంటని ప్రశ్నించారు. 

తుపాకులు నన్ను ఆపలేవు అంటూ యూపీలోని శాంతిభద్రతల పరిస్థితిపై ఘాటుగా ప్రశ్నలు కురిపించారు.  ప్రభుత్వం చారిత్రాత్మకమైన హస్తినకు రైలు మార్గాన్ని కూడా ఇవ్వలేకపోయిందని, అలాగే సామాజిక న్యాయం పేరుతో ప్రజలను మోసం చేస్తూ యూపీలో  ప్రభుత్వం విఫలమైందని తేలింది అని అన్నారు.

తన వాహనంపై కాల్పులు జరిపిన వారే మహాత్మా గాంధీని చంపారని, నా కారుపై దాడిలో నాలుగు రౌండ్ల బుల్లెట్లు పేల్చారని వేదికపై నుంచి ఒవైసీ గర్జించారు. నేను ప్రజల హక్కుల గురించి మాట్లాడుతానని, అందుకే నాపై బుల్లెట్ పేల్చారని అన్నారు. ఇంకా నేను ముస్లింల గురించి మాట్లాడతాను, అందుకే నాపై దాడి చేశారు. నేను రాజ్యాంగ పరిధిలో మాట్లాడితే వాళ్లు సహించలేరు. వారి బుల్లెట్లు నా గొంతును నిశ్శబ్దం చేస్తాయని వారు భావిస్తున్నారు. ఒక్క ఒవైసీని చంపితే నాలాగే లక్షల మంది ఒవైసీలు పుడతారని అన్నారు.

జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. తాను జెడ్ భద్రతను తీసుకోనని, పేదలకు భద్రత లభిస్తేనే వారికి భద్రత ఉంటుందన్నారు. నాకు భద్రత వద్దు, భారతదేశంలోని ముస్లింలను అలాగే పేదలను ఏ(A)క్లాస్ పౌరులుగా చేయండి అని అన్నారు.

దాడి వీడియో వైరల్  
ఘజియాబాద్‌లో ఒవైసీపై కాల్పులు జరిపిన వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. గురువారం మధ్యాహ్నం ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారుపై ఇద్దరు గుర్తుతెలియని యువకులు కాల్పులు జరిపినట్లు వీడియోలో స్పష్టంగా వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఒవైసీ ముందుగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఢిల్లీ-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని ఛిజార్సీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ ఘటన మొత్తం టోల్‌ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది.  ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయగా, మరోవైపు ఈ ఘటనలో ఓవైసీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ ఒవైసీ ప్రయాణిస్తున్న వాహనంపై రెండు బుల్లెట్ రంధ్రాలు కనిపించాయి అలాగే దాని టైర్‌లలో ఒకటి పంక్చర్ అయింది.

PREV
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu