విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రంపోసిన విద్యార్థి.. కేసు నమోదు

Published : Mar 06, 2023, 09:40 AM IST
విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రంపోసిన విద్యార్థి.. కేసు నమోదు

సారాంశం

New Delhi: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రంపోసిన విద్యార్థి పై కేసు నమోదైంది. అమెరికన్ ఎయిర్ లైన్స్ న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత ఏవియేషన్ రెగ్యులేటర్ ఎయిర్లైన్స్ నుండి వివరణాత్మక నివేదికను కోరింది.  

Drunk student urinated on fellow passenger on New York-Delhi flight: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం విసర్జన చేసిన మరో ఎయిరిండియా త‌ర‌హా ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఒక పాసింజ‌ర్ పై భార‌తీయ విద్యార్థి మూత్రం పోశాడు. తోటి ప్రయాణికుడిపై మూత్రంపోసిన విద్యార్థి పై కేసు నమోదైంది. అమెరికన్ ఎయిర్ లైన్స్ న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత ఏవియేషన్ రెగ్యులేటర్ ఎయిర్లైన్స్ నుండి వివరణాత్మక నివేదికను కోరింది.

వివ‌రాల్లోకెళ్తే... న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై ఒక భార‌తీయ విద్యార్థి మూత్ర విసర్జన చేశాడు. అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం నెంబర్ ఏఏ292లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు అమెరికా యూనివర్శిటీలో చదువుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడు నిద్రిస్తున్న సమయంలో మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై మొద‌ట బాధితుడు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. విమానంలో ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న సిబ్బంది పైలట్ కు సమాచారం అందించగా, వారు ఈ విషయాన్ని ఎటీసీకి నివేదించారు. ఆ త‌ర్వాత వారు నిందితుడి ప్రయాణికుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసుకున్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత ఏవియేషన్ రెగ్యులేటర్ ఎయిర్లైన్స్ నుండి వివరణాత్మక నివేదికను కోరింది. సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించినట్లు తేలితే క్రిమినల్ చట్టం కింద చర్యలు తీసుకోవడంతో పాటు నేరం స్థాయిని బట్టి నిర్ణీత కాలం అత‌ని విమాన ప్ర‌యాణాల‌పై నిషేధం విధిస్తారు. ''తాగిన మైకంలో ఉన్న ఓ విద్యార్థి మూత్ర విసర్జన చేశాడు. ఈ క్రమంలో అది తోటి ప్రయాణికుడిపై పడింది'' అని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (జేఎఫ్ కే) నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (డీఈఎల్ )కు సర్వీసుతో వెళ్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం 292ను స్థానిక లా ఎన్ ఫోర్స్ మెంట్ డీఈఎల్ కు చేరుకోగానే స‌ద‌రు ప్ర‌యాణికుడి కార‌ణంగా అంతరాయం కలిగించే ప‌రిస్థితులు ఎదుర్కొన్న‌ట్టు యూఎస్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 9.50 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని పేర్కొంది. 

విమానం రాగానే ప్రయాణికుడు భారీగా మత్తులో ఉన్నాడనీ, విమానంలో సిబ్బంది సూచనలను పాటించడం లేదని పర్సర్ తెలియజేశాడు. అతను ఆపరేటింగ్ సిబ్బందితో పదేపదే వాగ్వాదానికి దిగాడు, కూర్చోవడానికి ఇష్టపడలేద‌నీ, నిరంతరం సిబ్బంది-విమానాల భద్రతకు ప్రమాదం కలిగించాడ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. తోటి ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించి.. కొద్ది స‌మ‌యం త‌ర్వాత‌ చివరికి 15 జీలో కూర్చున్న ప్రాయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడని అమెరికన్ ఎయిర్లైన్స్ తెలిపింది.

భారత విమానయాన నియంత్రణ సంస్థ కూడా విమానయాన సంస్థ నుండి వివరణాత్మక నివేదికను కోరింది. గత కొన్ని నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. నిబంధనల ప్రకారం ఘటన జరిగిన 12 గంటల్లోగా ఈ విషయాన్ని రిపోర్ట్ చేయనందుకు ఎయిరిండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతుండగా, మిశ్రాపై నాలుగు నెలల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?