Ajit Pawar: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు.. కేంద్రంపై అజిత్ పవార్ ఫైర్

Published : May 26, 2022, 01:51 PM IST
Ajit Pawar: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు.. కేంద్రంపై అజిత్ పవార్ ఫైర్

సారాంశం

Central investigative agencies: జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు దుర్వినియోగం చేస్తున్నద‌ని ఎన్సీపీ నాయ‌కుడు, మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఆరోపించారు. మంత్రి ప‌రాబ్ నివాసంపై దాడుల జ‌రిగిన నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.   

Maharashtra : కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) స‌ర్కారు.. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నద‌ని ఎన్సీపీ నాయ‌కుడు, మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఆరోపించారు. మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ ప్రాంగణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలుసార్లు సోదాలు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. విచారణలు పారదర్శకంగా జరగాలని ఆయ‌న డిమాండ్ చేశారు.  "కేంద్ర దర్యాప్తు సంస్థలకు (శోధించే మరియు దాడులు చేసే) హక్కు ఉంది, కానీ వాటిని దుర్వినియోగం చేయకూడదు. రాష్ట్ర మంత్రి అనిల్ పరబ్‌పై ఎందుకు ఈ చర్య తీసుకున్నారో నాకు తెలియదు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే చర్యలు తీసుకోవాలి కానీ.. అది పారదర్శకమైన పద్ధతిగా ఉండాలి' అని అజిత్ పవార్ అన్నారు. 

గురువారం నాడు ఆయ‌న ముంబ‌యిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. "కేంద్ర ఏజెన్సీ ఈ అధికారాలను వివిధ మార్గాల్లో ఉపయోగిస్తుంది. ఈడి, ఐటి మొదలైనవి తమ పరిశోధనలను ఎలా నిర్వహిస్తాయో మీరు చూశారు. నా బంధువులపై కూడా చర్యలు తీసుకున్నారు. కేంద్ర ఏజెన్సీలకు దర్యాప్తు చేసే అధికారం ఉంది. కేంద్ర ఏజెన్సీలకు చట్టం నుండే హక్కు వచ్చింది, కానీ అది దుర్వినియోగం కాకుండా చూడాలి" అని అజిత్ ప‌వార్ అన్నారు.  మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ల కింద ఏజెన్సీ కేసు నమోదు చేసిన తర్వాత మహారాష్ట్ర మంత్రి మరియు శివసేన నాయకుడు అనిల్ పరాబ్‌తో సంబంధం ఉన్న పూణె మరియు ముంబైలోని ఏడు ప్రదేశాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.

మంత్రి ప‌రాబ్‌ అధికారిక నివాసంతో పాటు ఒక ప్రైవేట్ నివాసంపై కూడా దాడులు జరిగాయి. సెప్టెంబరు 2021లో, మాజీ హోం మంత్రి మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్‌పై లంచం మరియు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా పరబ్ ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బాంబే హైకోర్టులో మనీలాండరింగ్ కేసు వెనుక దేశ్‌ముఖ్  ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఉన్నార‌నీ, సంపదను కూడబెట్టడానికి తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశారని పేర్కొంది.

మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి Anil Parab ఇల్లు, కార్యాలయాలపై Encorcement Directorate  అధికారులు  గురువారం నాడు సోదాలు నిర్వహించారు. రత్నగిరి తీర ప్రాంత దాపోలిలో జరిగిన భూ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడినట్టుగా మంత్రి అనిల్ పరాబ్ ఇతరులపై ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ విచారణలో Shiv Sena నేత రవాణా శాఖ మంత్రి అనిల్ పరాబ్ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. 2017లో అనిల్ పరాబ్ దపోలి వద్ద భూమి కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్టుగా వచ్చిన ఆరోపణలపై 2019లో ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో పాటు మరికొన్ని ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu