చిదంబరానికి ఊరట: ఫిబ్రవరి 1వరకు నో అరెస్ట్

Published : Jan 11, 2019, 02:58 PM IST
చిదంబరానికి ఊరట: ఫిబ్రవరి 1వరకు నో అరెస్ట్

సారాంశం

ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో   మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన కొడుకు ఊరట లభించింది.


న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో   మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన కొడుకు ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన తనయుడు కార్తీని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని  న్యూఢిల్లీ కోర్టు ఆదేశించింది.

ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఫిబ్రవరి 1వ తేదీ వరకు వాయిదా వేస్తూ నిర్ణయం  తీసుకొంది. ఈ కేసు వాయిదా వరకు వీరిద్దరిని కూడ అరెస్ట్  చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 చిదంబరం కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో   ఎయిర్‌సెల్-మ్యాక్సిస్  డీల్‌లో విదేశాల నుండి నిధులు పెట్టుబడి పెట్టే విషయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్