బ్రేకింగ్: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన ఫ్లైట్‌

Siva Kodati |  
Published : Aug 07, 2020, 09:07 PM ISTUpdated : Aug 07, 2020, 09:24 PM IST
బ్రేకింగ్: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన ఫ్లైట్‌

సారాంశం

కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. కోజికోడ్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం క్రాష్ అయ్యింది. రన్‌వేపై అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం ధ్వంసమవ్వగా పలువురికి గాయాలయ్యాయి. 

కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. కోజికోడ్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం క్రాష్ అయ్యింది. రన్‌వేపై అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం ధ్వంసమవ్వగా పలువురికి గాయాలయ్యాయి.

 

 

ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఇప్పటికే భారీగా అంబులెన్సులు అక్కడికి చేరుకున్నట్లుగా సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 191 మంది ప్రయాణికులతో ఈ విమానం కేరళకు వస్తోంది.

ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, పదుల సంఖ్యలో గాలయాలైనట్లుగా తెలుస్తోంది. భారీ వర్షమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ ప్రకటించింది. ఇంకా వర్షం కురస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 

 

 

PREV
click me!

Recommended Stories

ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులు.. ఇండియాలో హైఅలర్ట్
Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu