ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రామాయణం ...యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో కు శ్రీరాముడు!

By Arun Kumar PFirst Published Sep 28, 2024, 1:16 PM IST
Highlights

యూపీఐటీఎస్ 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రామాయణ దర్శనం పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో రామాయణంలోని అన్ని ముఖ్యఘట్టాలను AI సాయంతో సృష్టించారు. అయోధ్య నగరాన్ని పురాతన వైభవోపేతంగా చూపించారు.

గ్రేటర్ నోయిడా : సనాతన ధర్మంలో భగవంతుడు అన్ని చోట్లా ఉంటాడని నమ్మకం. అలాంటప్పుడు ఉత్తరప్రదేశ్‌లో జరిగే కార్యక్రమంలో రాముడు లేకుండా ఎలా ఉంటాడు? గ్రేటర్ నోయిడాలో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరుగుతున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 లో ప్రపంచ సనాతన సంస్కృతికి ప్రాణమైన శ్రీరాముడు, ఆయన పాలించిన   అయోధ్య నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించారు. ఏఐ రామాయణ దర్శనం పేరుతో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోని అన్ని చిత్రాలను ఏఐ సాయంతో రూపొందించారు.

ఈ పెవిలియన్‌లో అయోధ్యను దాని పురాతన వైభవానికి అనుగుణంగా ప్రదర్శించారు. భగవాన్ రాముడి జీవితంలోని వివిధ సంఘటనలను కూడా గొప్పగా చూపించారు. ఈ పెవిలియన్‌లోని ఈ చిత్రాల నేపథ్యంలో వినిపించే 'రామ్ సీయ రామ్' సంగీతం దీని శోభను మరింతగా పెంచుతోంది. ప్రజల విశ్వాసానికి, ఆకర్షణకు కేంద్రంగా ఈ పెవిలియన్ నిలిచింది.

Latest Videos

ఆధ్యాత్మికత, ఆధునికతల అద్భుత సమ్మేళనం

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఉత్తరప్రదేశ్ సంస్కృతి శాఖ 'రామాయణ దర్శనం' పేరుతో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఏఐ ద్వారా రూపొందించిన రామాయణం. ఇందులో భగవాన్ శ్రీరాముడి జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలను సందర్శకులు చూడవచ్చు. రాముడు తన సోదరులతో కలిసి గురుకులంలో విద్యను అభ్యసించడం, సీతా స్వయంవరం, వనవాసం, సీతాపహరణం, లంకాదహనం, రావణ సంహారం వంటి సంఘటనలను ఇక్కడ ప్రదర్శించారు.ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలలో రామాయణంలోని అన్ని పాత్రలలోనూ వాస్తవికత, ఆధ్యాత్మికత, ఆధునికతల అద్భుత సమ్మేళనం కనిపిస్తుంది. అందుకే యూపీఐటీఎస్‌లో అన్ని చోట్లా ఈ ప్రదర్శన గురించే చర్చ జరుగుతోంది. దేశీయ, విదేశీ సందర్శకులు ఇక్కడికి ఎగబడుతున్నారు.

ఈ ప్రదర్శనను చూడటం వల్ల తమకు ప్రశాంతత కలుగుతోందని, మొత్తం వాతావరణం రామమయంగా మారిందని సందర్శకులు చెబుతున్నారు. ప్రజలు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. సంపూర్ణ రామాయణాన్ని దర్శించుకుని, శ్రీరాముడి ప్రేరణాత్మక ఘట్టాలను తమలో నింపుకుంటున్నారు.

click me!