రెండేళ్ల క్రితం అత్యాచారం.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ చేసి...!

Published : Jul 15, 2021, 08:54 AM IST
రెండేళ్ల క్రితం అత్యాచారం.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ చేసి...!

సారాంశం

ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఈ విషయం తెలిసింది. బాలిక పెళ్లి ఆపేందుకు ఆమెను అత్యాచారం చేసిన నాటి వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 

రెండేళ్ల క్రితం బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాధ నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. దీంతో.. కుటుంబసభ్యులు సదరు బాలికకు పెళ్లి చేయాలని అనుకున్నారు. పెళ్లి కూడా నిశ్చయించారు. త్వరలో పెళ్లి అనగా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఈ విషయం తెలిసింది. బాలిక పెళ్లి ఆపేందుకు ఆమెను అత్యాచారం చేసిన నాటి వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాట్నాలోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన మైనర్ బాలికపై రెండేళ్ల క్రితం  అత్యాచారం జరిగింది. మొత్తం ఐదుగురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఇప్పుడు బాలిక పెళ్లి చేసుకుంటోంది. ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. కాగా.. బాలిక పెళ్లి చేసుకోవడం నిందితుల్లో ఒకరికి నచ్చలేదు.

దీంతో.. బాలికను బెదిరించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటే వీడియో లీక్ చేస్తానంటూ ఆమెను బ్లాక్ మొయిల్ చేశాడు. అయితే.. అతని బెదిరింపులను బాలిక పట్టించుకోలేదు. దీంతో.. చివరకు ఆ వీడియోని లీక్ చేశాడు. దీంతో.. బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలిసి నిందితుడు అభిషేక్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu