దేశవ్యాప్తంగా సంచలన రేపిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఆమె వాంగ్మూలంలో.. అక్టోబర్లో తాను అఫ్తాబ్ ఫ్లాట్కి రెండుసార్లు వెళ్లానని, అఫ్తాబ్ చాలా సాధారణంగా ప్రవర్తించేవాడని చెప్పింది.
శ్రద్ధా హత్య కేసు: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధా హత్యను అత్యంత దారుణంగా హత్య చేసి.. ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి.. అడవిలో పడవేసినట్లు పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడు అఫ్తాబ్ అంగీకరించాడు. తాజాగా.. ఈ కేసులో శ్రద్ధ హత్య తర్వాత అఫ్తాబ్ తన ఫ్లాట్కి తీసుకొచ్చిన అమ్మాయి సంచలన వాంగ్మూలం తెరపైకి వచ్చింది. తన లైవ్-ఇన్ భాగస్వామి శ్రద్ధా వాకర్ను హత్య చేసిన ఆఫ్తాబ్ పూనావాలాతో డేటింగ్ చేసిన మహిళ.. అతని భయంకరమైన చర్య తెలుసుకుని షాక్కు గురైంది.హత్యానంతరం తన ఫ్లాట్కు రెండుసార్లు వెళ్లింది.
పోలీసుల విచారణ ఆ డేటింగ్ విషయాన్ని తలుచుకోని భయాందోళనకు గురైంది. నిందితుడితో అతని ఫ్లాట్ కు వెళ్లినప్పుడు.. ఆ ఫ్లాట్లో హత్య చేసినట్టు గానీ, మృతదేహం ముక్కలను భద్రపరిచినట్లు గానీ ఎలాంటి ఆధారాలు కనిపించలేవని తెలిపింది. అఫ్తాబ్ తనకు అక్టోబర్ 12న ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడని యువతి పోలీసులకు తెలిపింది. ఈ ఉంగరం శ్రద్ధకు చెందినదని, హత్య చేసిన తర్వాత నిందితుడు అఫ్తాబ్ తన ఇతర స్నేహితుడికి బహుమతిగా ఇచ్చాడని చెబుతున్నారని పోలీసుల విచారణ తెలింది. శ్రద్దా హత్యానంతరం .. అప్తాబ్ తో డేటింగ్ చేసిన యువతి వృత్తి రీత్యా డాక్టర్ అని పోలీసుల విచారణ వెల్లడైంది.
అఫ్తాబ్ ఫ్లాట్కి రెండుసార్లు వెళ్లాను
అక్టోబర్లో తాను అఫ్తాబ్ ఫ్లాట్కి రెండుసార్లు వెళ్లానని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఆ సమయంలో అప్తాభ్ ముఖంలో అసలు ఎలాంటి భయం కనిపించలేదని, అఫ్తాబ్ చాలా మామూలుగా తనతో ఉన్నదని తెలిపింది. తనతో మాట్లాడినప్పుడల్లా.. తన ముంబై ఇంటి గురించి చెప్పేవాడనీ, డేటింగ్ యాప్ ద్వారా తనతో పరిచయమైందని తెలిపింది. అఫ్తాబ్ వేర్వేరు డేటింగ్ సైట్లలో యాక్టివ్గా ఉండేవాడని, దాదాపు 10 నుంచి 15 మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
యువతికి కొనసాగుతున్న కౌన్సెలింగ్
అఫ్తాబ్ వద్ద పెర్ఫ్యూమ్లు, డియోడరెంట్ల సేకరణ ఉందని అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు పోలీసులకు తెలిపింది. వాటిని ఆమెకు చాలాసార్లు బహుమతిగా కూడా ఇచ్చాడంట.అఫ్తాబ్కు సిగరెట్ అలవాటు ఉందని తెలిపింది. అతను వివిధ రకాల ఆహారాన్ని చాలా ఇష్టపడేవాడు . ఇంట్లో వివిధ రెస్టారెంట్ల నుండి మాంసాహారాన్ని ఎక్కువ ఆర్డర్ చేసేవాడని ఆమె పేర్కొంది. అఫ్తాబ్ హత్యోన్మాదం తెలుసుకున్న ఆ యువతి మానసికంగా చాలా కలత చెందింది. అఫ్తాబ్ శ్రద్ధను 35 ముక్కలుగా నరికాడని తెలియగానే, ఆమె చాలా షాక్ అయ్యింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.