యువకుడితో 50యేళ్ల మహిళ ఛాటింగ్.. పెళ్లికి ఒప్పించి, డబ్బులు తీసుకుని..తీరా పెళ్లిరోజు మరో ట్విస్ట్...

Published : May 23, 2022, 02:31 PM IST
యువకుడితో 50యేళ్ల మహిళ ఛాటింగ్.. పెళ్లికి ఒప్పించి, డబ్బులు తీసుకుని..తీరా పెళ్లిరోజు మరో ట్విస్ట్...

సారాంశం

ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయి ఫ్రొఫైల్ తో ఓ మహిళ యువకుడిని ముగ్గులోకి దింపి పెళ్లి దాకా తీసుకువచ్చింది. తీరా పెళ్లి పీటల మీదికి వచ్చాక... 

కర్ణాటక : ఫేస్ బుక్ లో అందమైన యువతి ఫొటో పెట్టి యువకుడిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపిన 50యేళ్ల మహిళ పెళ్లి ఖర్చుల కోసం అతడి నుంచి మూడున్నల లక్షలు కొట్టేసింది. ఇదే ట్విస్ట్ అనుకుంటే ఇంకో షాకింగ్ సీన్ కూడా ఉంది. తన పిన్నమ్మను పంపిస్తున్నానంటూ ఆమే అతడి వద్దకు వచ్చి డబ్బులు తీసుకెళ్లడం గమనార్హం. ఈ స్టోరీ ఇంతటితో అయిపోలేదు.. చివర్లో ఇంకో షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది. 

ఇలా ట్విస్టుల మీద ట్విస్టులున్న ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ తాలూకాలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్ బుక్ ద్వారా ఓ యువతి పరిచయమయ్యింది. మాటా మాటా కలిసింది. ప్రేమకు దారి తీసింది. అది మరింత ముదరడంతో ఆమెను విడిచి బతకడం సాధ్యం కాదని యువకుడు డిసైడైపోయాడు.  జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. ముచ్చట్లు చెప్పుకున్నారు. తన కలల రాకుమారిని కలవాలని అతడు చాలాసార్లు ప్రయత్నించాడు.

అయితే అతడు తన కోరికను బయటపెట్టిన ప్రతీసారీ.. ఆమె.. అమ్మో.. వస్తే ఇంకేమైనా ఉందా? మా అమ్మానాన్నలు చూశారంటే అసలుకే ఎసరొస్తుందని భయపెట్టేది. దీంతో ఆమెను కలిసే ప్రయత్నాన్ని అతను విరమించుకున్నాడు. అయితే, ఆమె మీద పెంచుకున్న ప్ేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకన్న యువకుడు అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా సరే అంది. మాట్లాడేందుకు తన పిన్నిని పంపుతున్నానని చెప్పింది. 

అనుకున్నట్లుగానే ఓ శుభముహూర్తానా ఆమె పిన్ని వారింటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా మాట్లాడింది. పెళ్లికి వారు అంగీకరించడంతో తమవైపు కూడా రెడీ అని చెప్పింది. ఈ క్రమంలో ఇంట్లో వారికి తెలియకుండా యువకుడు ఆమె చేతిలో రూ.3.50లక్షలు పెట్టాడు. పెళ్లి ఖర్చులకు పనికొస్తాయని, పెళ్లి కూడా ఖరారయ్యింది. ఆదిచుంచనగరి మఠంలో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి వచ్చి యువతి పిన్న.. పెల్లి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె చెప్పింది విని పోలీసులే విస్తుపోయారు. ఫేస్ బుక్ లో యువకుడికి పరిచయం అయిన ఆ యువతి ఈ ‘పిన్ని’ ఒక్కరే అని తెలిసి అవాక్కయ్యారు. వారే కాదు.. విషయం తెలిసిన యువకుడుకి మూర్చ వచ్చినంత పనైంది. తన ఫొటోకు బదులుగా మరో యువతి ఫొటోను పెట్టి యువకుడిని బోల్తా కొట్టించినట్టు అంగీకరించింది. అతడి నుంచి తీసుకున్న రూ.3.50లక్షలను వెనక్కి ఇచ్చేందుకు ఆమె అంగీకరించడంతో రాజీ కుదిరింది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu