అయోధ్య కేసు విచారణ బెంచ్: తెలుగు జడ్జికి చోటు

Published : Jan 08, 2019, 06:20 PM IST
అయోధ్య కేసు విచారణ బెంచ్: తెలుగు జడ్జికి చోటు

సారాంశం

వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి కేసును విచారించేందుకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది.   


ఢిల్లీ : వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి కేసును విచారించేందుకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తారని సుంప్రీకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో తెలుగువారైన జస్టిస్ ఎన్ వీ రమణ పేరు కూడా ఉండటం విశేషం. 

ఎన్వీ రమణతోపాటు జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిట్ యూయూ లలిత్, జస్టిట్ డీవై చంద్రచూడ్ లు ఉన్నారు. ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నెల 10 నుంచి అయోధ్య కేసుపై విచారణ జరపనుంది.  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతం గురించి దాఖలైన ఈ కేసు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు ప్రాంతంలో వివాదాస్పద 2.77ఎకరాల భూమిని నిర్మోహీ అఖారా, రామ్‌ లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డులకు మూడు భాగాలుగా పంచుతూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్