యూపీలో 42 మంది కరోనా రోగుల మిస్సింగ్: అధికారుల గాలింపు

Published : Jul 31, 2020, 03:45 PM IST
యూపీలో 42 మంది కరోనా రోగుల మిస్సింగ్: అధికారుల  గాలింపు

సారాంశం

 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజీపూర్ లో 42 మంది కరోనా రోగులు అదృశ్యమయ్యారు. ఆచూకీ లేకుండా పోయిన వీరి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.


లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజీపూర్ లో 42 మంది కరోనా రోగులు అదృశ్యమయ్యారు. ఆచూకీ లేకుండా పోయిన వీరి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో 3300 కరోనా సోకిన రోగులు కన్పించకుండా పోయిన  విషయం మర్చిపోకముందే  యూపీలో కూడ 42 మంది కరోనా రోగులు కన్పించకుండా పోయారు.

కన్పించకుండా పోయిన రోగులను పట్టుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  ఈ మేరకు ఘజిపూర్ మెడికల్ అధికారి అడిషన్ జిల్లా మేజిస్ట్రేట్ కు లేఖ రాశారు. కన్పించకుండా పోయిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

ఘజిపూర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,138కి పెరిగింది. గురువారం నాడు 70 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 567 మంది రోగులు కరోనా నుండి కోలుకొన్నారు. ఇంకా 567 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 10 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 80 వేలను దాటాయి. గురువారం నాడు ఒక్క రోజే 3705 కేసులు నమోదయ్యాయి.

గురువారం నాడు ఒక్క రోజే అత్యధికంగా 57 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1587 మంది కరోనాతో చనిపోయారు.
 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!