దంచికొడుతున్న ఎండలు.. మార్చిలోనే 40 డిగ్రీలు ! రాబోయే రోజుల్లో వడగాలుల ప్రభావం !... వాతావరణ శాఖ

Published : Mar 29, 2022, 08:56 AM IST
దంచికొడుతున్న ఎండలు.. మార్చిలోనే 40 డిగ్రీలు ! రాబోయే రోజుల్లో వడగాలుల ప్రభావం !... వాతావరణ శాఖ

సారాంశం

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దీనికి వడగాలులు తోడవ్వబోతున్నాయి. ఈ మేరకు వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు, నాలుగు రోజులు వడగాలులు, వేడి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. 

ఢిల్లీ : ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మార్చి పూర్తికాకముందే ఏప్రిల్ రాకముందే దేశంలోని అనేక ప్రాంతాలు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నాయి. సోమవారం (మార్చి 28), ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అధిక వేడిని నమోదు చేసింది. ఢిల్లీలో సోమవారం రోజు 39.1 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ఇది యేటా ఈ సీజన్ లో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత కంటే ఏడు notches ఎక్కువగా ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (NCR)లో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నరేలాలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, అంటే సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది.

ఇదిలావుండగా, జార్ఖండ్‌లోని 10 జిల్లాల్లో బుధవారం నుండి మూడు రోజుల పాటు వేడిగాలులు విపరీతంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను తాకవచ్చని వారు హెచ్చరించారు.
గర్వా, పలాము, లతేహర్, చత్రా, బొకారో, ధన్‌బాద్, సిమ్‌డేగా, తూర్పు మరియు పశ్చిమ సింగ్‌భూమ్, సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాల్లో వడగాలులు, వేడిగాలులు విపరీతంగా వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, సౌరాష్ట్ర-కచ్‌లలో రాబోయే 2 రోజులలో, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, రాజస్థాన్‌లలో వచ్చే 4-5 రోజులలో isolated heat wave పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. మార్చి 30-ఏప్రిల్ 1, 2022 వరకు దక్షిణ హర్యానా, దక్షిణ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, తూర్పు మధ్యప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలు, ఉత్తర మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

భోపాల్‌లోని లేక్స్ నగరం, ఆదివారం నమోదైన 38.7 డిగ్రీల సెల్సియస్‌కు వ్యతిరేకంగా 40-డిగ్రీ సెల్సియస్ (39.8) వద్ద పగటి ఉష్ణోగ్రతతో సోమవారం కూడా మండే వేడిని చూసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే కొద్ది రోజుల్లో భోపాల్ ఉష్ణోగ్రత 2-3 డిగ్రీల పెరుగుదలను చూస్తుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 41-44 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. ఈ వేసని వేడి నుంచి ఎలాంటి ఉపశమనం ఉండదని, రాబోయే కొద్ది రోజుల పాటు విపరీతమైన వేడి-వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu