ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదు..

By AN TeluguFirst Published Sep 11, 2021, 9:44 AM IST
Highlights

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా దీనికి ముందు గురువారం హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. కాంగడా జిల్లాలో సంభవించిన భూకంప ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కనిపించింది. 

ఉత్తరాఖండ్ లోని జోషీ మఠ్ లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 4.6గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రభావం చుట్టు పక్కల రాష్ట్రాలపైనా కనిపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం 5.58 గంటలకు భూకంపం చోటు చేసుకుంది. 

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా దీనికి ముందు గురువారం హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. కాంగడా జిల్లాలో సంభవించిన భూకంప ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కనిపించింది. 

ఈ భూకంప తీవ్ర 3.6గా నమోదయ్యింది. తాజాగా భూకంపం సంభవించిన సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

కాగా, గత మంగళవారం మెక్సికోలోని పసిఫిక్ రిసార్ట్ నగరమైన అకపుల్కో సమీపంలో  7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తీవ్రతతో వందల మైళ్ల దూరంలో ఉన్న రాజధానిలో ఒక్కసారి ఇల్లు కంపించాయి. ఒకరు మృతి చెందారు. 

భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కోకు ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు ఉందని నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ నివేదించింది. దీనికి సమీపంలోని కొయుకా డి బెనిటెజ్ సిటీలో యుటిలిటీ పోల్ మీద పడడంతో ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో చెప్పారు.

కానీ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ మాత్రం ఒక వీడియో సందేశంలో పెద్ద నష్టం జరిగినట్టు నివేదికలు లేవని చెప్పారు. అకాపుల్కోలో అనేక వాహనాలపై యుటిలిటీ స్తంభాలు పడిపోయాయి. చర్చి ముఖభాగం కూలిపోయిందని ఏఎఫ్ పి ప్రతినిధి తెలిపారు.

ఈ వరుస ప్రకంపనలతో బెంబేలెత్తిన పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేసి పరుగులు పెట్టారు.  "నేను స్నానం చేస్తున్నాను. ఒక్కటేసారి కంపించడం, కదులుతున్నట్లుగా అనిపించింది. నాకు చాలా భయం వేసింది. గట్టిగా అరిచాను" అని మెక్సికోకు చెందిన ఒక పర్యాటకుడు తెలిపాడు. ఈయన బాత్ టవల్‌తోనే బయటికి పరిగెత్తుకొచ్చాడు. 

మరొకరు మాట్లాడుతూ.. "నేను మా అమ్మతో వచ్చాను. మేము హోటల్ 11 వ అంతస్తులో ఉన్నాం" అని అతను ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని కౌగిలించుకున్నాడు.

అకాపుల్కో మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ, ఈ ప్రకంపనలు సిటీలో చాలా భయాందోళనలక దారి తీశాయన్నారు. "ప్రకంపనలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందుతున్నారు." అంతేకాదు దీని పర్యవసానంగా నివాస ప్రాంతాలలో "చాలా గ్యాస్ లీకేజీలు" గుర్తించబడ్డాయని ఆమె చెప్పారు.

భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా వచ్చింది. నివాసితులు మరియు పర్యాటకులు ఇళ్లు, హోటళ్ల నుండి వీధుల్లోకి పరుగులు పెడుతున్నారు. 

"నేను చాలా భయపడ్డాను. ఈ రాత్రి నేను నిద్రపోతానో లేదో నాకు తెలియదు. నా కుమార్తె గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఆమెను బయటకు తీసుకెళ్లడానికి నేను ఆమెను లేపాను. నేను బూట్లు కూడా వేసుకోలేదు.  నేను బూట్లు కూడా వేసుకోలేదు" అని 49- అన్నారు ఏళ్ల నివాసి లారా విల్లా.

 

 

click me!