భార్యలను వదిలేస్తామని బెదిరింపు... 382 ఎన్నారై పాస్‌పోర్టులు రద్దు..

Published : Feb 05, 2021, 01:01 PM IST
భార్యలను వదిలేస్తామని బెదిరింపు... 382 ఎన్నారై పాస్‌పోర్టులు రద్దు..

సారాంశం

విదేశాల్లో భార్యలను ఇబ్బందులకు గురిచేస్తూ.. వదిలేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎన్నారైల 382 పాస్ట్ పోర్టులు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు గురువారం పార్లమెంటులో తెలిపింది. 

విదేశాల్లో భార్యలను ఇబ్బందులకు గురిచేస్తూ.. వదిలేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎన్నారైల 382 పాస్ట్ పోర్టులు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు గురువారం పార్లమెంటులో తెలిపింది. 

2015 నుంచి ఇప్పటివరకు ఇలా మొత్తం 382 పాస్ పోర్టులు రద్దు చేయడమో, స్వాధీనం చేసుకోవడమో జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది. ఎన్నారై భర్తలు వేధింపులకు పాల్పడుతున్నారని, పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన తరువాత వదిలేస్తామంటున్నారని మహిళలు కేసులు పెట్టారన్నారు.

ఇలాంటి కేసుల్లో ఇప్పటివరకు 216 మంది మహిళలు  ప్రభుత్వం నుండి న్యాయ, ఆర్థిక సహాయం కోరినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ పార్తాప్ సింగ్ బజ్వా అడిగిన ఓ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ విదేశాల్లో కష్ట సమయాల్లో భారతీయ పౌరులకు సాయం చేయడానికి అక్కడి అఖిల భారత మిషన్లు భారత సమాజ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాయని తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మ హారతి | Ujjain Jyotirlingam | Asianet News Telugu
ఉత్తరాఖండ్‌లో గ్యాస్ కొరత.. హోటల్స్ లో ఏం చేశారో చూడండి | LPG Shortage | Asianet News Telugu