తమిళనాడులో ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు, ఇద్దరు సజీవ దహనం

By Siva KodatiFirst Published Sep 7, 2022, 5:45 PM IST
Highlights

తమిళనాడులోని దిండిగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగి బస్సు మంటల్లో చిక్కుకున్న ఘటనలో ఇద్దరు సజీవ దహనమవ్వగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫైరింజిన్ చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్థమైంది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదం కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దిండిగల్ జిల్లా బైక్‌ను ఢీకొట్టింది బస్సు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అగ్నికీలల్లో చిక్కుకుంది. అలర్ట్ అయిన ప్రయాణీకులు బస్సులోంచి దూకి పరుగులు తీశారు. సమాచారం అందుకుని ఫైరింజిన్ చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్థమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!