పుణె కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

Published : Jun 07, 2021, 07:46 PM ISTUpdated : Jun 07, 2021, 07:56 PM IST
పుణె కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

సారాంశం

మహారాష్ట్రలోని పుణెలో సోమవారం నాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

పుణె:మహారాష్ట్రలోని పుణెలో సోమవారం నాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. కెమికల్ ఫ్యాక్టరీలో  జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది కార్మికులు  మృతి చెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మంటల్లో ఇద్దరు కార్మికులు చిక్కుకొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 12 మంది కార్మికుల మృతదేహాలను  అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు.  మరో మూడు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో 17 మంది చిక్కుకొన్నారు. వీరిలో 15 మంది మహిళలు, ఇద్దరు పురుషులుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడ కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు.  ఫ్యాక్టరీలో ఇవాళ సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.  మొత్తం 8 ఫైరింజన్లు  మంటలను ఆర్పాయి.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంబవించిందని భావిస్తున్నామని  ఎస్‌వీఎస్ అక్వా డైరెక్టర్ ఎస్వీఎస్  నీకుంజ్ షా చెప్పారు.


 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?