రాజస్థాన్‌లో జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Feb 19, 2019, 07:27 AM IST
రాజస్థాన్‌లో జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది దుర్మరణం

సారాంశం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అంబవాలిలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. 

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అంబవాలిలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రతాప్‌గఢ్-జైపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలిలోనే తొమ్మిది మంది మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మరో 15 మందిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Zebra Crossings : జీబ్రా క్రాసింగ్ నలుపు తెలుపులోనే ఎందుకు ఉంటుంది? ఎల్లో ఎందుకు వాడరు?
Keerthana Sampath: విజయ్ ని గెలిపించిన తెలుగమ్మాయి.. ఎవరీ కీర్తనా సంపత్? | Asianet News Telugu