రాజస్థాన్‌లో జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది దుర్మరణం

By Siva KodatiFirst Published Feb 19, 2019, 7:27 AM IST
Highlights

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అంబవాలిలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. 

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అంబవాలిలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రతాప్‌గఢ్-జైపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలిలోనే తొమ్మిది మంది మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మరో 15 మందిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Rajasthan: At least 10 people died after they were run over by a truck on Pratapgarh-Jaipur Highway in Ambawali Village of Pratapgarh district, earlier tonight. pic.twitter.com/FS8zTtNDDQ

— ANI (@ANI)
click me!