లోయలో పడ్డ బస్సు: జమ్మూలో 12మంది మృతి

By narsimha lodeFirst Published Aug 21, 2018, 1:27 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


జమ్మూకాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని  కిష్టవార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. యాత్రికులతో  వెళ్తున్న  బస్సు  దోల్ ఏరియాలో లోయలో పడిపోయింది.  బస్సుపై డ్రైవర్ కంట్రోల్ తప్పిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు భావిస్తున్నారు. 

 

Kishtwar: 11 dead bodies recovered, 5-year-old injured child shifted to hospital, after a vehicle carrying 'Machel Mata' devotees rolled down in river Chenab 28 kilometres from Kishtwar towards Padder, earlier today. pic.twitter.com/lAtl5AFzZy

— ANI (@ANI)

 

 ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరుతీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు  కొండచరియలు విరిగిపడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు.  సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.

click me!