ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

Published : Nov 18, 2020, 09:47 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

సారాంశం

టెంపో సూరత్‌ నుంచి పావగఢకు వెళ్తుండగా వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరిగింది.   


గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటెయిన్‌, టెంపో ఢీకొన్న సంఘటనలో 10 మంది మృత్యువాత పడగా.. 17 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున వడోదర సమీపంలో చోటు చేసుకుంది. టెంపో సూరత్‌ నుంచి పావగఢకు వెళ్తుండగా వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. 

వేకువ జామున ఘటన జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డ వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్