
మెగాస్టార్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న `విశ్వంభర` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మెగా157`పేరుతో రూపొందుతున్న మరో మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ని కన్ఫమ్ చేశారు. `మన శంకరవరప్రసాద్గారు` అనే టైటిల్ని ఖరారు చేశారు. `పండక్కి వస్తున్నారు` అనేది ట్యాగ్లైన్. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేశారు. మెగాస్టార్ స్టయిల్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో ఈ గ్లింప్స్ ఉండటం విశేషం.
ఇందులో బ్లాక్ సూట్ బూట్ వేసుకుని బ్లాక్ కారులో నుంచి దిగుతూ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సిగరేట్ తాగుతూ, తన స్టయిల్లో కళ్లజోడు పెట్టుకుని కారులో నుంచి స్టయిల్గా, మాస్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన బాడీగార్డ్స్ తో కలిసి సీరియస్ గా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వాక్లో చిరు మార్క్ మ్యానరిజం, స్టయిల్ కనిపిస్తుంది. వింటేజ్ చిరంజీవిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ ఇంట్లో మెట్లమీద నుంచి మాస్గా దిగుతూ వస్తున్నారు. చేతిలో గన్ ఉంది. యాక్షన్ ఇరగదీశాడని దీని బట్టి అర్థమవుతుంది. చివర్లో గుర్రాన్ని పట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్ అదిరిపోయింది.
అయితే ఇందులో చిరంజీవి మార్క్ పాత సినిమాలను గుర్తు చేస్తూ, తన పాత్రల లుక్ని చూపిస్తూ ఈ గ్లింప్స్ సాగింది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో టైటిల్ కూడా విభిన్నంగా ఉంది. ఏదో మాస్గా, పవర్ఫుల్గా ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా `మన శంకరవరప్రసాద్ గారు` అంటూ చిరంజీవి అసలు పేరుని టైటిల్గా పెట్టడం విశేషం. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అనే విషయం తెలిసిందే.
ఇక ఇందులో చిరంజీవి ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే హడావుడి చూస్తుంటే నిజంగానే చిరు అలాంటి పాత్రలో కనిపిస్తున్నారా? లేక సినిమాలో ఏదైనా డ్రామాలో భాగమా? అనే డౌట్ కూడా వస్తుంది. ఏదేమైనా మాస్ ఆడియెన్స్ కి మంచి ట్రీట్ లా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఇందులో మెగాస్టార్ మార్క్ ఎలాంటి డైలాగ్లు లేకపోవడం చిరు ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తోంది. ఇది గ్లింప్సే కావడంతో మున్ముందు ఇంకా చాలా ఉంటుందని చెప్పొచ్చు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహుగారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చిరు పెద్ద కూతురు సుస్మిత ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. అందుకే ట్యాగ్ లైన్ని `పండక్కి వస్తున్నారు` అని పెట్టారు. అనిల్ రావిపూడి చివరగా వెంకటేష్తో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్ అయ్యింది.