కేసీఆర్, జగన్‌లను సోనియా ఆహ్వానించలేదు, 23 తర్వాతే: అహ్మద్ పటేల్

Siva Kodati |  
Published : May 16, 2019, 08:47 PM IST
కేసీఆర్, జగన్‌లను సోనియా ఆహ్వానించలేదు, 23 తర్వాతే: అహ్మద్ పటేల్

సారాంశం

 వైసీపీ చీఫ్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సోనియా గాంధీ కూటమిలోకి చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కథనాలపై స్పందించారు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటి వచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు మిత్ర పక్షాలను వెతుక్కునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సోనియా గాంధీ కూటమిలోకి చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ కథనాలపై స్పందించారు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్. ఈ నెల 23న ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల నేతలు ఢిల్లీకి రావాలంటూ సోనియా గాంధీ ఎలాంటి లేఖ రాయలేదన్నారు.

వైసీపీ, టీఆర్ఎస్ అధినేతలకు సోనియా లేఖలు రాశారంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలేనని పటేల్ స్పష్టం చేశారు. ఈ నెల 23న జరిగే కీలక సమావేశం తర్వాతే ఎవరెవరితో కలవాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే అవకాశం ఉందని అహ్మద్ పటేల్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు