
దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7గంటల నుంచే ఓటు వేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
వేసవి దృష్ట్యా ప్రజలంతా ఉదయాన్నేపోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ క్యూ లైన్లో నిల్చొని మరీ ఓటు వేశారు.
కాగా.. వారి బాటలోనే హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, కార్తీ, మరో హీరో విజయ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరుల్లాగా క్యూలో నిల్చొని ఓటు వేశారు.