అది నా రక్తంలోనే ఉంది.. విజేందర్ సింగ్

By telugu teamFirst Published May 10, 2019, 4:14 PM IST
Highlights


ఓడినా, గెలిచినా తాను రాజకీయాల్లో కొనసాగుతానని  ఒలంపిక్ విజేత విజేందర్ సింగ్ అన్నారు.  శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. విజేందర్ ఇటీవల రాజకీయాల్లో చేరి..దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి గా  పోటీ చేస్తున్నారు.

ఓడినా, గెలిచినా తాను రాజకీయాల్లో కొనసాగుతానని  ఒలంపిక్ విజేత విజేందర్ సింగ్ అన్నారు.  శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. విజేందర్ ఇటీవల రాజకీయాల్లో చేరి..దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి గా  పోటీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గెలిచినా.. ఓడినా రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. అలా అని బాక్సింగ్ ని మానేయడం లేదని చెప్పారు. బాక్సింగ్ తన రక్తంలో ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మ్‌ ఆద్మీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆప్‌తో పొత్తు పెట్టుకోపోవడమే మంచిదైందన్నారు.

రాజకీయాలు , క్రీడలు వేర్వేరు రంగాలని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బాగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని కొనియాడారు. ధనవంతులకే బీజేపీలో స్థానం ఉంటుందన్నారు. తాను ఒక మామూలు డ్రైవర్‌ కుమారుడినని, తనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చిందని తెలిపారు. దక్షిణ ఢిల్లీ అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాననితీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

click me!