డాక్టర్ పోరెడ్డి రంగయ్య తెలుగు కవిత: ధ్వజమెత్తిన అక్షరం

By telugu teamFirst Published Aug 21, 2020, 12:46 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో కవిత్వం విశిష్టమైంది. అక్షరాలు ఆయుధాలుగా ఎలా పనికి వస్తాయో పోరెడ్డి రంగయ్య తన ధ్వజమెత్తిన అక్షరం కవితలో వ్యక్తం చేశారు.

ఆ కలం నుంచి
అంగారం కురిసింది.
అంతేనా!
శృంగారమూ ఒలికింది.

మనిషి పిడికడంతే!
భావాలు మాత్రం పిడిగుద్దులు.
ఆవేశం ఉద్యమ కొలిమై
అగ్గి పుట్టించి
రాతి గుండెల్లో
కాక రగిలించిన సమరాక్షరం .

నిరంకుశ కోరలను
చిదిమింది ఖడ్గమై. 
పరిపాలన ముసుగులో
వెట్టి చాకిరిని  ఎర చేసి
పచ్చని బతుకులను నంజుకున్న
మద క్రీడా వినోదుల
భరతం పట్టింది ఆ అక్షరం.

జైలు గోడకు
అగ్గి పుట్టించి
తిమిరంపై ధ్వజ మెత్తిన
సమరభేరి అయ్యింది.
గుండె గుండెను తాకి
తిరుగుబాటు జ్వాలను
రగిల్చింది.

రూపు కట్టుకున్న పద్యం
కాగితపు మడతల్లో
గుర్రు పెట్టలేదు.
ప్రజా సమూహ
పిడికిలి అయ్యింది.
ఈ మాగాణ గుండె చప్పుడై
రుద్ర వీణను మీటింది.

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!