రాజేందర్ జింబో కవిత: గాయం

Published : Oct 26, 2021, 01:38 PM IST
రాజేందర్  జింబో కవిత: గాయం

సారాంశం

తెలుగులో ప్రసిద్ధ కవి జింబో మంగారి రాజేందర్ విశిష్టమైన కవిత్వం అందించారు. ఆయన రాసిన గాయం కవితను ఇక్కడ చదవండి.

గాయాలు చేస్తూ
అమ్మా బాపు వెళ్లిపోయారు

అకాలంగా
అక్కలు అన్నలు వెళ్లిపోయారు
కాలం వాళ్ళని కర్కశంగా కాటేసింది

ప్రతి మరణం ఓ గాయమే !

ఓ ఫోటోనో,ఓ వస్తువో
ఓ ఆటో,ఓ పాటో
ఓ ఉత్తరమో-
వాళ్ళని గుర్తు చేస్తూనే ఉంటాయి
అవి కనిపించని సమయం లేదు

ఓ కవి అన్నట్టు
కాలం గాయాలను మాన్పుతుందేమో
జ్ఞాపకాలని కాదు కదా !!

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం