ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకి సహృదయ సాహితీ పురస్కారం

Published : Aug 27, 2021, 02:51 PM ISTUpdated : Aug 27, 2021, 02:52 PM IST
ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకి సహృదయ సాహితీ పురస్కారం

సారాంశం

 కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా  “సహృదయ సాహితీపురస్కారాన్ని” అందిస్తున్నది.  ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 2019  సం.రానికి గాను ఆచార్య బేతవోలు రామబ్రహ్మం రచించిన “శమంతకమణి “ పద్యకావ్యం ఎంపికైంది.

వరంగల్లులోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 1996 నుండి ప్రతిసంవత్సరం సుప్రసిద్ధ సాహితీమూర్తులు కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా  “సహృదయ సాహితీపురస్కారాన్ని” అందిస్తున్నది.   నవల , కథ , వచనకవిత , పద్యకవిత , సాహిత్యవిమర్శ ...విభాగాలలో ప్రతిసంవత్సరం ఒద్దిరాజు వేణుగోపాలరావు  సౌజన్యంతో అందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 2019  సం.రానికి గాను ఆచార్య బేతవోలు రామబ్రహ్మం రచించిన “శమంతకమణి “ పద్యకావ్యం ఎంపికైంది.   పోటీకి వచ్చిన 32  పద్యకావ్యాలనుండి న్యాయనిర్ణేతలు ఈ కావ్యాన్ని ఎంపిక చేశారు.

 గతంలో డా. కేశవరెడ్డి , అల్లం శేషగిరిరావు, నాళేశ్వరం శంకరం, అనుమాండ్లభూమయ్య , ఎస్వీ రామారావు, గొల్లపూడి మారుతీరావు , మునిపల్లె రాజు,  డా. ఎండ్లూరి సుధాకర్ ,  డా గరికపాటి నరసింహారావు ,  డా. జయ ప్రభ, డా. ఎంవి తిరుపతయ్య , కె. వరలక్ష్మి, దర్భశయనం శ్రీనివాసాచార్య,  డా. పుల్లూరి ఉమా,  డా. బన్నా ఐలయ్య , కరణం బాలసుబ్రహ్మణ్యంపిళ్ళై, డా. కాలువ మల్లయ్య, రామాచంద్రమౌళి, డా, సి హెచ్ లక్ష్మణమూర్తి , శిరంశెట్టి కాంతారావు, మురళీధర్, మందరపు హైమవతి  ఈ పురస్కారం అందుకున్నారు.

ఫిబ్రవరిలో జరగబోయే రజతోత్సవాలలో పురస్కార గ్రహీతకు  రూ.10,000/లు నగదు , జ్ఞాపిక , శాలువాలతో సహృదయ  సత్కరిస్తుందని ఒక ప్రకటనలో సంస్థ అధ్యక్షులు గన్నమరాజు గిరిజామనోహరబాబు, ప్రధాన కార్యదర్శి డా.ఎన్.వి.ఎన్.చారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం