JEE Advanced 2022 rescheduled:ఆగస్టు 28న టెస్ట్ - రిజిస్ట్రేషన్, కొత్త షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు మీకోసం

Ashok Kumar   | Asianet News
Published : Apr 15, 2022, 11:11 AM IST
JEE Advanced 2022 rescheduled:ఆగస్టు 28న టెస్ట్ - రిజిస్ట్రేషన్, కొత్త షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు మీకోసం

సారాంశం

ఆగస్టు 7 నుండి 11 వరకు విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 12గా నిర్ణయించారు. 

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2022ని ఇప్పుడు ఆగస్టు చివరిలో నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షల  జూలై 3న  జరగాల్సి ఉండగా తేదీలను రీషెడ్యూల్ చేసారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి JEE అడ్వాన్స్‌డ్ 2022ని ఆగస్టు 28న నిర్వహిస్తుంది.

ఆగస్టు 7 నుండి 11 వరకు విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 12గా నిర్ణయించారు. ఆగస్టు 23 నుండి ఆగస్టు 28 మధ్య JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే వారు అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. JEE అడ్వాన్స్‌డ్ 2022 హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి - jeeadv.ac.in - అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు. 

వార్తా నివేదికల ప్రకారం, JEE అడ్వాన్స్‌డ్ 2022 ఉదయం ఇంకా మధ్యాహ్నం షిఫ్ట్‌లలో జరుగుతుంది . పేపర్ 1 సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండగా, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 11న, JEE అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలు విడుదల చేయబడతాయి. సెప్టెంబర్ 12 నుంచి సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

"తాత్కాలిక సమాధానాల కీ సెప్టెంబర్ 3న విడుదల చేస్తారు, అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుండి 4 వరకు తాత్కాలిక సమాధానాల కీపై అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. ఫైనల్ కీ అండ్ ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదల చేయబడుతుంది" అని JEE అడ్వాన్స్‌డ్ 2022 షెడ్యూల్‌ లో పేర్కొన్నట్లు ఒక నివేదిక నివేదించింది.

అయితే విద్యార్థులు వారి వద్ద ఉన్న మెటీరియల్‌పైనే దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు కొత్త టాపిక్ నేర్చుకోవడం మానుకోవాలి. మీరు ఇప్పటివరకు చదివిన వాటిని సవరించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, సబ్జెక్ట్ అండ్ టాపిక్‌పై మీ పట్టు బలంగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్స్ ఏప్రిల్, మే సెషన్లను రానున్న జూన్, జూలైలకు వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించింది . కొత్త తేదీల ప్రకారం, JEE మెయిన్ 2022 సెషన్ 1 జూన్ 20 - 29 మధ్య జరుగుతుంది, సెషన్ 2 జూలై 21 - 30, 2022 మధ్య జరుగుతుంది.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Money Saving Tips : కేవలం రూ.20 వేల శాలరీతో రూ.2.5 కోట్లు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?