సైనిక స్కూల్స్ లో ప్రేవేశాలు.. నవంబర్ 19 ధరఖాస్తుల చివరి తేదీ...

Ashok Kumar   | Asianet News
Published : Nov 07, 2020, 06:17 PM ISTUpdated : Nov 07, 2020, 10:00 PM IST
సైనిక స్కూల్స్ లో ప్రేవేశాలు.. నవంబర్ 19 ధరఖాస్తుల చివరి తేదీ...

సారాంశం

 అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.  

ఢిల్లీ : సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లోకి ఏఐఎస్‌ఎస్‌ఈఈ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగుస్తుంది.

అధికారిక వెబ్ సైట్ https://aissee.nta.nic.inలో వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు దరఖాస్తును పంపాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ www.nta.ac.inలోనూ దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూడవచ్చు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓబీసీ-ఎన్‌సీఎల్‌ కేటగిరీ కింద కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 33 సైనిక పాఠశాలల్లో ఆరవ తరగతిలోకి బాలికలకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!