బెయిల్ మంజూరు: దోశ తిన్న రాహుల్ గాంధీ

By narsimha lodeFirst Published Jul 7, 2019, 12:57 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  పాట్నా కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌లో దోశ తిని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లారు.

పాట్నా: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  పాట్నా కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌లో దోశ తిని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లారు.

ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ ఫిర్యాదు పరువు నష్టం దావా దాఖలు చేశారు.ఈ కేసులో శనివారం నాడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల  ప్రచారంలో  మోడీపై విమర్శలు చేశారు.  దొంగల ఇంటిపేరు మోడీ అంటూ విమర్శలు గుప్పించారు.

నరేంద్ర మోడీ,  బ్యాంకుల స్కామ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీల పేర్లను రాహుల్ గాంధీ ప్రస్తావించాడు.ఈ విమర్శలపై సుశీల్ మోడీ రాహుల్ పై పరువు  నష్టం దావా వేశాడు.  ఈ కేసులో శనివారం రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

click me!