అల్ ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం... ప్రకటించిన జో బైడెన్..

By Bukka SumabalaFirst Published Aug 2, 2022, 6:43 AM IST
Highlights

ఆల్-ఖైదా చీఫ్, ఈజిప్షియన్ సర్జన్ అయిన ఐమన్ అల్-జవహిరి సోమవారం ఆఫ్ఘనిస్తాన్‌లో CIA డ్రోన్ దాడిలో మరణించాడు. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరు. సెప్టెంబర్ 11, 2001 దాడుల్లో 3,000 మందిని చంపిన దాడుల సూత్రధారిగా గుర్తించబడ్డాడు.

వాషింగ్టన్ : అల్ఖైదా అగ్ర  నాయకుడు అల్ జవహరీని అమెరికా మట్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన డ్రోన్ దాడిలో ఆల్ జవహరీని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. వీకెండ్ లో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన స్ట్రైక్స్ లో అల్ ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని యునైటెడ్ స్టేట్స్ హతమార్చిందని, 2011లో దాని వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత.. తీవ్రవాద సంస్థకు అతిపెద్ద దెబ్బ అని అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం అన్నారు.

అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా కాబూల్ లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ నివాసంపై ‘వైమానిక దాడి’ జరిగినట్లు  తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండించారు. 

ఈజిప్టు సర్జన్ అయిన అల్-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరుగా మారాడు. 2001  సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన దాడుల్లో మూడు వేల మంది మరణించారు. ఈ దాడులకు పాల్పడిన సూత్రధారుల్లో ఒకరుగా అల్-జవహరీని అమెరికా గుర్తించింది. అప్పటినుంచి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా జవహరీ పరారీలోనే ఉన్నాడు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన తర్వాత అల్ఖైదా పగ్గాలు  జవహరీ స్వీకరించాడు. జవహరీ తలపై  25 మిలియన్ డాలర్ల రివార్డు ను యూఎస్ ప్రకటించింది. 

US ఇంటెలిజెన్స్ గూఢచార ప్రసారాల ద్వారా ఈ దాడుల్లో మరణించిన వ్యక్తి వ్యక్తి జవహిరి అని నిర్ధారించిందని, ఒక సీనియర్ పరిపాలన అధికారి విలేకరులతో చెప్పారు. కెన్యా, టాంజానియాలోని యుఎస్ఎస్ కోల్, యుఎస్ రాయబార కార్యాలయాలపై దాడులకు జవహిరీ ప్రధాన సూత్రధారి లేదా కీలక పాత్ర పోషించాడని బిడెన్ చెప్పారు.

"జవహిరి U.S. జాతీయ భద్రతకు అనేక రకాలుగా ముప్పును కలిగిస్తూనే ఉన్నారు" అని ఒక కాన్ఫరెన్స్ కాల్‌లో తెలిపారు. "అతని మరణం ద్వారా  అల్ ఖైదాకు కోలుకోలేని దెబ్బ, వారు బలహీనపడతారు’ అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో అనేక సార్లు జవహిరి మరణం గురించి పుకార్లు వచ్చాయి. కాగా, అతనికి చాలా కాలంగా ఆరోగ్యం బాగోలేదని నివేదించబడింది.

ఆగస్టు 31, 2021న అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని.. అల్-ఖైదా లక్ష్యంపై యునైటెడ్ స్టేట్స్ చేసిన మొట్టమొదటి ఓవర్-ది-హోరిజోన్ స్ట్రైక్ ఇదే. అయితే ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్‌లో ఎక్కడ జరిగిందో అమెరికా అధికారులు స్పష్టం చేయలేదు.శనివారం ఉదయం ఆఫ్ఘన్ అంతర్గత మంత్రిత్వ శాఖ కాబూల్‌లో డ్రోన్ స్ట్రైక్ గురించి సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న నివేదికలను ఖండించింది, AFP కి రాజధానిలోని "ఖాళీ ఇంటి" మీద రాకెట్ పడిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అయితే మంగళవారం తెల్లవారుజామున కాబూల్‌లో, తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ నగరంలోని షేర్పూర్ ప్రాంతంలోని నివాసంపై "వైమానిక దాడి" జరిగిందని ట్వీట్ చేశారు.

 

On Saturday, at my direction, the United States successfully conducted an airstrike in Kabul, Afghanistan that killed the emir of al-Qa’ida: Ayman al-Zawahiri.

Justice has been delivered.

— President Biden (@POTUS)
click me!