అమెరికాలో కాల్పుల కలకలం: హంతకుడు మిస్సింగ్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

Siva Kodati |  
Published : Jun 21, 2020, 07:07 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం: హంతకుడు మిస్సింగ్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

సారాంశం

అమెరికాలో చాలా రోజుల తర్వాత కాల్పుల కలకలం రేపాయి. మిన్నెయాపోలిస్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి పౌరులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి

అమెరికాలో చాలా రోజుల తర్వాత కాల్పుల కలకలం రేపాయి. మిన్నెయాపోలిస్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి పౌరులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి.

శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో 11 మంది గాయపడగా, ఒకరు మరణించినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. నిందితుడి ఆచూకీ తెలియరాలేదని, ఆ ప్రాంత ప్రజలెవ్వరూ బయట తిరగొద్దని పోలీసులు సూచించారు.

ఈ ఘటనను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టగా అందులో ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Iran Israel war: ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు ఎందుకు కొట్టుకుంటున్నాయి.? అస‌లు వీళ్ల లొల్లి ఏందీ..
Israel: మ‌ళ్లీ మొద‌లైన యుద్ధం.. దూసుకొచ్చిన మిస్సైళ్లు. అసలేం జరగనుంది.?