అమెరికాలో దుండగుల కాల్పులు, ముగ్గురి మృతి

Siva Kodati |  
Published : May 14, 2019, 11:05 AM ISTUpdated : May 14, 2019, 11:31 AM IST
అమెరికాలో దుండగుల కాల్పులు, ముగ్గురి మృతి

సారాంశం

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.. వారం కిందట పాఠశాలలో విద్యార్ధులపై జరిగిన కాల్పుల ఘటనను మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.. వారం కిందట పాఠశాలలో విద్యార్ధులపై జరిగిన కాల్పుల ఘటనను మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌‌లోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ష్రెవె 4000 బ్లాక్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంటి ముందు ఓ వ్యక్తి, మరో నలుగురు తుపాకీ గాయాలతో కనిపించారు.

వీరిలో ముగ్గురు అప్పటికే మరణించగా.. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వీరంతా 20 నుంచి 30 ఏళ్లలోపు నల్లజాతీయులు కావడంతో జాత్యాంహర దాడిగా పోలీసులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ