ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల కలకలం..10మంది ఉగ్రవాదులు మృతి

Published : Nov 25, 2019, 07:20 AM IST
ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల కలకలం..10మంది ఉగ్రవాదులు మృతి

సారాంశం

ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. 

ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తాలిబన్ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కమాండరుతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. ఆర్చి జిల్లా క్వారలుక్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘాన్ భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. 

ఈ కాల్పుల్లో ఐదుగురు ఆఫ్ఘాన్ సెక్యూరిటీ గార్డులు కూడా గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ