సూసైడ్ బాంబర్ అటాక్... 27 మంది సైనికుల దుర్మరణం

By Siva KodatiFirst Published Feb 14, 2019, 2:30 PM IST
Highlights

ఇరాన్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధాని టెహ్రాన్‌లో ఆత్మహుతి దాడికి పాల్పడి...27 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా పేలుడు పదార్థాలతో నిండిన కారును టెర్రరిస్టులు పేల్చేశారు. 

ఇరాన్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధాని టెహ్రాన్‌లో ఆత్మహుతి దాడికి పాల్పడి...27 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా పేలుడు పదార్థాలతో నిండిన కారును టెర్రరిస్టులు పేల్చేశారు.

ఈ ఘటనలో బస్సులో ఉన్న 27 మంది దుర్మరణం పాలవ్వగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40 ఏళ్ల ఇస్లామిక్ విజయోత్సవాలకు ప్రతీకగా ఉగ్రవాదులు ఈ దాడిని నిర్వహించాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ దాడికి బాధ్యత వహిస్తూ జైషే అల్ ఆదిల్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

click me!