
ఉక్రెయిన్ (ukraine)కు, రష్యా (russia)కు మధ్య భీకర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. రష్యా వైమానిక దళాలను ఉపయోగించి ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ కు రాజధాని కైవ్ ను చుట్టుముట్టి కాల్పులు జరుపుతోంది. వివిధ ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్దం ఆపాలని చాలా దేశాలు రష్యాకు విజ్ఞప్తి చేస్తున్నాయి. గురువారం రాత్రి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) కు ఫోన్ కాల్ చేశారు. తక్షణమే హింసను విడనాడి, దౌత్యం ద్వారా సమస్యను పరిస్కరించుకోవాలని సూచించారు. నేడు అప్ఘనిస్తాన్ (afghanistan) తాలిబన్ల ప్రభుత్వం కూడా రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది.
రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తుండటంతో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. రెండు దేశాల సైనికులు మరణిస్తున్నారు. అయితే ఈ యుద్దం ఉక్రెయిన్ భూ భాగంలో జరుగుతుండటంతో ఆ దేశానికే ఎక్కువ నష్టం జరుగుతోంది. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) తాజాగా ఓ ప్రకటన చేశారు తక్షణమే ప్రతిఘటనను ఆపేసి తమ నాయకులపై తిరగబడాలని ఉక్రెయిన్ మిలిటరీకి పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో పుతిన్ మాట్లాడారు. చాలా ఉక్రెయిన్ సైనిక విభాగాలు రష్యా దళాలతో నిమగ్నమవ్వడానికి సుముఖంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలు చూపట్టలేదు.
ఉక్రెయిన్ రాజధాని కైవ్కు వాయువ్యంగా కేవలం 7 కి.మీ (4 మైళ్లు) దూరంలో ఉన్న వ్యూహాత్మక హాస్టొమెల్ ఏరోడ్రోమ్ (Hostomel aerodrome) ను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని, ఆ ప్రాంతంలో పారాట్రూప్ (paratroops)లను దించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్లో ఉక్రెయిన్ ప్రత్యేక యూనిట్ల నుండి 200 మందికి పైగా తొలగించబడ్డారు. రష్యా సైన్యం పశ్చిమం నుండి కైవ్కు ప్రవేశాన్ని నిరోధించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాద దళాలు రష్యా సైన్యం మద్దతుతో ఉక్రేనియన్ ఆర్మీ స్థానాలపై దాడి చేశాయి. కైవ్లోని నివాస ప్రాంతాలపై దాడి చేయబోమని రష్యా సైన్యం తెలిపింది.
శుక్రవారం తెల్లవారుజామున రష్యా దళాలు, క్షిపణులు ఉక్రెయిన్ రాజధాని కైవ్, దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాలపై దాడి చేశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే అనేక కుటుంబాలు ఆశ్రయాలకు తరలించబడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అంతర్జాతీయ సమాజాన్ని తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రష్యాపై పోరులో తాము ఒంటరి వారిమై పోయామని విజ్ఞప్తి చేశారు. కానీ వెనక్కి తగ్గబోమని అన్నారు. ఇప్పటివరకు 10 మంది సైనికాధికారులతో సహా 137 మంది మరణించారని ఆయన చెప్పారు. మరో 316 మందికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయన బంకర్ లోకి వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి. దీనిని ఆయన ఖండించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని ప్రజలు మధ్యలోనే ఉంటానని చెప్పారు. దేశ ముఖ్య అధికారులు, నాయకులతో కలిసి ఉన్న ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. దేశం స్వాతంత్రం కోసం తాము ఇక్కడే ఉన్నామని తెలిపారు.