Russia Ukraine Crisis: యుద్ధం ఆప‌డం అంద‌రికీ శ్రేయ‌స్క‌రం.. ఉక్రెయిన్ లో ఐరాస చీఫ్

Published : Apr 28, 2022, 12:54 AM IST
Russia Ukraine Crisis: యుద్ధం ఆప‌డం అంద‌రికీ శ్రేయ‌స్క‌రం.. ఉక్రెయిన్ లో ఐరాస చీఫ్

సారాంశం

UN chief Guterres: యుద్ధం నేప‌థ్యంలో మాస్కో పర్యటనలో భాగంగా ఐక్య‌రాజ్య స‌మితి చీఫ్‌ ఆంటోనియో గుటెర్రెస్ అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. అక్క‌డి నుంచి ఆయ‌న ఉక్రెయిన్ కు చేరుకున్నారు.   

RussiaUkraineConflict: ఉక్రెయిన్‌-ర‌ష్యాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం 60 రోజులు దాటింది. ఉక్రెయిన్ ధీటుగా బ‌దులిస్తుండ‌టంతో.. ర‌ష్యా సేన‌లు మరింత‌ దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ ఎటుచూసినా శిథిలాల దిబ్బ‌లుగా ఆ దేశ న‌గ‌రాలు మారుతున్నాయి. ఈ యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్-ర‌ష్యాలే కాకుండా ప్ర‌పంచ దేశాలు సైతం ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన ఐక్య‌రాజ్య స‌మితి ఇరు దేశాలు శాంతి చ‌ర్చ‌ల‌తో యుద్ధానికి ముగింపు ప‌ల‌కాల‌ని సూచిస్తోంది. దీనిలో భాగంగా ఐక్యరాజ్య స‌మితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇరు దేశాల అధినేత‌ల‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. య‌ద్ధానికి వీలైనంత త్వ‌ర‌గా ముగింపు ప‌లికేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

మాస్కో పర్యటన తర్వాత ఐక్యారాజ్య స‌మితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ బుధవారం ఉక్రెయిన్‌కు చేరుకుని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు.  అంత‌కు ముందు అతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.  మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ ప్లాంట్ నుండి పౌరుల తరలింపులో ఆయన ఐక్యరాజ్యసమితి ప్రమేయానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాస్కోలో చర్చల అనంతరం ఐరాస చీఫ్ గుటెర్రెస్ బుధవారం కైవ్‌కు చేరుకున్నట్లు ప్రకటించారు. "నేను మాస్కోను సందర్శించిన తర్వాత ఉక్రెయిన్ చేరుకున్నాను. మానవతా మద్దతును విస్తరించడానికి & సంఘర్షణ ప్రాంతాల నుండి పౌరులను తరలించడానికి మేము మా పనిని కొనసాగిస్తాము. ఈ యుద్ధం ఎంత త్వరగా ముగుస్తుందో, అంత మంచిది.. ఒక్క ఉక్రెయిన్-ర‌ష్యాల‌కు మాత్ర‌మే కాదు యావ‌త్ ప్ర‌పంచం కోసం..” అని ఆంటోనియో గుటెర్రెస్ ట్వీట్ చేశారు.

 

ఆంటోనియో గుటెర్రెస్ మరియు అతని బృందం పోలాండ్‌లోని Rzeszow నుండి ఉక్రెయిన్‌లోని కైవ్‌కు ప్రయాణించారు. గురువారం నాడు ఈ ఆయ‌న ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్స్కీ మరియు విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో సమావేశమవుతారు. ఈ సంద‌ర్భంగా  ఆంటోనియో గుటెర్రెస్  క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తారని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే "మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ ప్లాంట్ నుండి పౌరులను తరలించడంలో ఐక్యరాజ్యసమితి మరియు రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ ప్రమేయానికి అధ్యక్షుడు సూత్రప్రాయంగా అంగీకరించారు. మానవతా వ్యవహారాల సమన్వయం కోసం ఐక్యరాజ్యసమితి కార్యాలయం మరియు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో తదుపరి చర్చలు జరుగుతాయి ”అని రీడౌట్ తెలిపింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసిన రెండు నెలల తర్వాత..  ప‌రిస్థితులు ఇప్పికే దారుణంగా మార‌డం.. అణుబాంబులు, మూడో ప్ర‌పంచ యుద్ధం వంటి వ్యాఖ్య‌ల‌తో నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన ఐరాస చీఫ్ గుటెర్రెస్..  పుతిన్ మరియు జెలెన్స్‌కీని కలిసి చ‌ర్చ‌లు జ‌ర‌పానికి నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే పుతిన్ క‌లిసిన ఆయ‌న‌.. జెలెన్స్కీతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌బోతున్నారు. అంత‌కు ముందు పౌరుల ప్రాణాలు ర‌క్షించ‌డం కోసం.. మాన‌వ‌తా చ‌ర్య‌ల పున‌రుద్ధ‌ర‌ణ కోసం ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి అత్యవసర చర్యలకు పిలుపునిచ్చారు. “ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా, నేను శాంతి దూతగా మాస్కోకు వచ్చాను. నా లక్ష్యం మరియు నా ఎజెండా ప్రాణాలను కాపాడటానికి మరియు బాధలను తగ్గించడానికి ఖచ్చితంగా ముడిపడి ఉంది”అని మంగళవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జరిగిన స‌మావేశం అనంత‌రం గుటెర్రెస్  పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే