కామెరూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 53 మంది మృతి..

Published : Jan 28, 2021, 01:28 PM IST
కామెరూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 53 మంది మృతి..

సారాంశం

మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 53మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 21మంది క్షతగాత్రులయ్యారు. కామెరూన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంక్చు గ్రామం వద్ద ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది.   

మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 53మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 21మంది క్షతగాత్రులయ్యారు. కామెరూన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంక్చు గ్రామం వద్ద ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది. 

ప్రయాణికులతో వెళుతున్న బస్సును అక్రమంగా ఆయిల్‌ తరలిస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 53 మంది మరణించారని, మరో 21 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.  ట్రక్కులోని ఆయిల్‌ బస్సుపై పడి నిప్పు అంటుకోవడంతో  ప్రమాదం జరిగింది. దీంతో దహనమయ్యింది. 

అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతన్ని అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారి శరీరాలు తీవ్రంగా కాలి పోయాయని, గుర్తించడం కూడా కష్టంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు