హఫీజ్ సయీద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష రూ. 2 లక్షల జరిమానా: పాక్ కోర్టు

By narsimha lodeFirst Published Dec 25, 2020, 10:23 AM IST
Highlights

ఇండియాలోని ముంబై టెర్రర్ దాడులకు  మాస్టర్ మైండ్  జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు  పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గురువారం నాడు పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు  రూ. 2 లక్షల జరిమానాను కూడ సయీద్ కు విధించింది కోర్టు.

ఇస్లామాబాద్: ఇండియాలోని ముంబై టెర్రర్ దాడులకు  మాస్టర్ మైండ్  జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు  పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గురువారం నాడు పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు  రూ. 2 లక్షల జరిమానాను కూడ సయీద్ కు విధించింది కోర్టు.

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా పాకిస్తాన్ కోర్టు ఇప్పటికే 21 జైలు శిక్ష విధించింది.  లాహోర్ లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు గురువారం నాడు సయీద్ తో పాటు  మరో ఐదుగురు నేతలకు శిక్ష విధించింది.

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక తోడ్పాటు అందించినందుకు ఐదు నేరాల్లో 36 ఏళ్ల పాటు సయీద్ కు జైలు శిక్ష విధించారు.ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  రెండు కేసుల్లో 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ ఏడాది నవంబర్ మాసంలో  మరో రెండు కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

click me!