హఫీజ్ సయీద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష రూ. 2 లక్షల జరిమానా: పాక్ కోర్టు

Published : Dec 25, 2020, 10:23 AM IST
హఫీజ్ సయీద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష రూ. 2 లక్షల జరిమానా: పాక్ కోర్టు

సారాంశం

ఇండియాలోని ముంబై టెర్రర్ దాడులకు  మాస్టర్ మైండ్  జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు  పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గురువారం నాడు పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు  రూ. 2 లక్షల జరిమానాను కూడ సయీద్ కు విధించింది కోర్టు.

ఇస్లామాబాద్: ఇండియాలోని ముంబై టెర్రర్ దాడులకు  మాస్టర్ మైండ్  జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు  పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గురువారం నాడు పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు  రూ. 2 లక్షల జరిమానాను కూడ సయీద్ కు విధించింది కోర్టు.

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా పాకిస్తాన్ కోర్టు ఇప్పటికే 21 జైలు శిక్ష విధించింది.  లాహోర్ లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు గురువారం నాడు సయీద్ తో పాటు  మరో ఐదుగురు నేతలకు శిక్ష విధించింది.

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక తోడ్పాటు అందించినందుకు ఐదు నేరాల్లో 36 ఏళ్ల పాటు సయీద్ కు జైలు శిక్ష విధించారు.ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  రెండు కేసుల్లో 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ ఏడాది నవంబర్ మాసంలో  మరో రెండు కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ