ఏడాది క్రితం నాటి నూడిల్స్ తిని.. 9మంది మృతి

Published : Oct 22, 2020, 03:41 PM IST
ఏడాది క్రితం నాటి నూడిల్స్ తిని.. 9మంది మృతి

సారాంశం

సంవత్సరం క్రితం వండిన నూడిల్స్ ని ఆవురావురు మంటూ లాంగించేశారు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు.

నిన్న వండిన వంటే.. ఈ రోజు కి బాగుండదు. ఫ్రిడ్జ్ లో పెడితే.. మహా అయితే ఇంకో రెండు రోజులు ఉంటుంది. అలాంటిది.. ఏకంగా సంవత్సరం క్రితం వండిన ఆహారం ఇప్పటిదాకా ఎలా బాగుంటుంది. కుళ్లిపోయి.. పాడైపోయి ఉంటుంది. దానిని గమనించిన ఓ కుటుంబం.. సంవత్సరం క్రితం వండిన నూడిల్స్ ని ఆవురావురు మంటూ లాంగించేశారు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలోకి బీజింగ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏడాది క్రితం ఇంట్లో నూడుల్స్ వండుకున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏడాది పాటు అలాగే వదిలేశారు. ఏడాది తర్వాత కుటుంబ సభ్యులంతా తలో చేయి వేద్దాం అన్నట్లుగా తిన్నారు. పులియబెట్టిన మొక్కజొన్న పిండితో చేసిన ఈ నూడుల్స్‌ను యేడాది పాటు ఫ్రిజ్‌లో పెట్టడంతో దాంట్లో బోంగ్రెకిక్ ఆసిడ్ అనే విష పదార్థం తయారైంది. దీంతో ఈ నూడుల్స్ తిన్న 9 మంది (అందరూ పెద్దవారే) చనిపోయారు. కాగా, ముగ్గురు చిన్నారులు నూడుల్స్ రుచి వారికి నచ్చకపోవడంతో వారు తినలేదు. నూడుల్స్ తినకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ