మయన్మార్ లో కూలిన సైనిక విమానం.. బౌద్ధ సన్యాసితో సహా 12 మంది మృతి !

Published : Jun 11, 2021, 01:54 PM IST
మయన్మార్ లో కూలిన సైనిక విమానం.. బౌద్ధ సన్యాసితో సహా 12 మంది మృతి !

సారాంశం

మయన్మార్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మిలటరీ విమానం కూలిన ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

మయన్మార్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మిలటరీ విమానం కూలిన ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

న్యాపిడా నుంచి ఫైన్ ఓ -ఎల్విన్ పట్టణానికి వెల్తుండగా జరిగి ఈ దారుణ ఘటనలో ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసి కూడా ఉన్నట్టు సమాచారం. ఆయనతో సహా మొత్తం 12 మంది ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

ఫైన్ ఓ -ఎల్విన్ పట్టణంలోని కొత్త మఠం శంకుస్థాపన చేసేందుక వెల్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. 

ఈ ఘటనలో ఓ బాలుడు సహా మిలటరీకి చెందిన మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్టు మిలటరీకి చెందిన ఓ టీవీ ఛానల్ వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ